VKB: పేదలకు వరం ఇందిరమ్మ ఇల్లు అని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం 2వ వార్డులోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు చింతకాయల మొగులమ్మ గృహప్రవేశానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.