AP: నెయ్యి కల్తీ జరగలేదని వైసీపీ అబద్దాలు ఆడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వస్తోందని, వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు కూడా తాము వారిపై ఆరోపణలు చేయలేదన్నారు. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచి కూడా తయారు చేయవచ్చని చూపించినట్లు తెలిపారు. నెయ్యి కల్తీ అప్పటి టీటీడీ పాలకమండలి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.