JGL: జగిత్యాల మండలం ధరూర్ ఎస్సారెస్పీ కెనాల్లో దూకి నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన అనూష మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనూష కుటుంబం గత కొన్నేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారు. ఉదయం విజయవాడ నుంచి వచ్చిన కొందరితో డబ్బుల విషయంలో ఘర్షణ జరగడంతో, అవమాన భారంతో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.