విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై పోరాడుతున్న కార్మికులు, కమ్యూనిస్టులపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను సీపీఎం తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఏచూరి భవన్లో జరిగిన సమావేశంలో సీసీ సభ్యుడు లోకనాథం మాట్లాడారు. ఈ సందర్భంగా వీర్రాజు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.