KKD: గొల్లప్రోలు పట్టణంలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామునే విశ్వాసులు చర్చిలకు చేరుకుని యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకున్నారు. యేసు కృపా ప్రార్థన సహవాసంలో పాస్టర్ జయశీల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనలు నిర్వహించగా విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు ప్రేమ, శాంతి సందేశాలను వివరించారు.