KMM: కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలో మెట్టెల రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి రూ. 9000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. మృతుడు రవి నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబానికి అండగా నిలిచినట్లు నాయకులు వెల్లడించారు.