SRPT: సూర్యాపేట మున్సిపల్ పరిధిలో పశువుల సంచారం మితిమీరుతోంది. పగలు వార్డుల్లో, రాత్రి వేళల్లో మెయిన్ రోడ్లపై ఆవులు తిష్టవేయడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి రోడ్లపై పశువుల సంచారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.