BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు సింహ వాహనంపై తిరువీధుల్లో విహరించారు. స్వామివారిని, అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి మాడవీధుల్లో ఊరేగింపు సేవ కొనసాగించారు. భక్తుల జయ జయ ద్వానాలతో, కళాకారుల నృత్యాలు మేళా వాయిద్యాలతో కన్నులవిందుగా కొనసాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.