RR: శేరిలింగంపల్లి గోపి చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. చెరువు శుభ్రత, నీటి నిల్వ సామర్థ్యం పెంపు లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. చెరువులో పేరుకుపోయిన మట్టి, చెత్తను యంత్రాలతో తొలగిస్తూ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ చర్యలతో వర్షాకాలంలో నీటి నిల్వ మెరుగుపడి, పరిసర ప్రాంతాలకు ఉపశమనం కలగనుంది.