NDL: నంద్యాల పట్టణం తెలుగుపేటలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, తిరుమంజనం నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.