నంద్యాల జిల్లా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 2022 ఏప్రిల్ 4న పాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాను విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ప్రాధాన్యం గల ఈ జిల్లాలో శ్రీశైలం, మహానంది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.