కర్నూలు (మ) ఈ. తాండ్రపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించినట్లు CI తేజ మూర్తి శుక్రవారం తెలిపారు. ఆటో డ్రైవర్ మహేంద్ర, అతని స్నేహితుడు శివకుమార్పై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, వీరి అఘాయిత్యం కారణంగా బాధితురాలు గర్భవతి కావడంతో మార్చి 28న ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.