W.G: ఆకివీడులో జరిగిన హింసాత్మక ఘటనపై నిజనిర్ధారణ బృందాన్ని నియమించినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు. BRK నాయుడు, అమర్జహా బేగం, విశ్వేశ్వర్ రెడ్డి, అంకెమ్ సీతారామ్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందం బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి నివేదిక సమర్పించాలని ఆమె కోరారు.