KDP: సిద్ధవటం(M) మాధవరం-1 గ్రామంలో పట్టపగలే వీధి దీపాలు వెలిగిపోతూ విద్యుత్ వృథా అవుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. పగటి సమయంలో కూడా లైట్లు ఆపకపోవడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.