AP: పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరిగా ఉన్న మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. CCTV ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలి నుండి కీలక సాక్ష్యాలను సేకరించింది.