KMM: ముడిగొండ మండలం పమ్మిలో సీపీఎం నాయకుడు కామ్రేడ్ చావ శంకరయ్య 33వ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను చిలుకూరి ఉపేందర్రావు ఆవిష్కరించారు. గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి శంకరయ్య చేసిన కృషి ఎనలేనిదని సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యుడు టీఎస్. కల్యాణ్ కొనియాడారు.