NLG: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఇవాళ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీసీ భవనంలో ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారం శ్రీనివాస్, చేగొండి మురళి యాదవ్ తదితర నాయకులు పాల్గొని నివాళులర్పించారు.