CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపంలో గల శ్రీ విరుపాక్షి మారమ్మ శుక్రవారం సందర్భంగా పసుపు, కుంకుమ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను పల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పసుపు,కుంకుమ, వెండి కిరీటంతో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.