KDP: ఒంటిమిట్ట కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం కాలియమర్దన అలంకారంలో శ్రీ రాముడు గ్రామ పురవీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా స్వామి వారి ఊరేగింపులో అడుగడుగున కోలాటాలు, భజనలు, కేరళ వాయిద్యాలు అలరించాయి. స్వామి వారికి భక్తులు కాయకర్పూరం సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఇవాళ సాయంత్రం అశ్వ వాహనంపై కోదండ రాముడు ఊరేగనున్నారు.