JGL: భారత ప్రభుత్వం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అందించే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ శాఖ జనరల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. 18-25 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, 10వ తరగతి, 12వ తరగతి, ఐటిఐ/ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలన్నారు.