యుద్ధంలో బాణాలతో అయిన గాయాలనైనా వైద్యంతో నయం చేయవచ్చు. కాలిపోయిన అడవి వర్షానికి మళ్లీ చిగురిస్తుంది. కానీ, ఒకరి మనసును గాయపరుస్తూ అనే ‘కఠినమైన మాటలు'(వాక్శరాలు) చేసే గాయానికి మందు లేదు. ఆ గాయం జీవితాంతం మానదని విదురుడు బోధించాడు. అందుకే మాట్లాడేటప్పుడు ఎదుటివారి మనసు నొప్పించకుండా జాగ్రత్తగా, మృదువుగా మాట్లాడాలని, నోరు జారకూడదని విదుర నీతి సారాంశం.