NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ను నల్గొండ ఏఐఎంఐఎం నాయకులు కలిశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంఏ ఉర్దూ, LLB, ఫార్మసీ కోర్సులను ప్రారంభించాలని నల్గొండ జిల్లా అధ్యక్షుడు రజీయుద్దీన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అడ్మిషన్ల సౌలభ్యం కోసం పర్షియన్, అరబిక్ వంటి విదేశీ భాషలను కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు రఫీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.