BDK: మణుగూరు మండల పరిధిలోని కమలాపురం గ్రామం సమీప గోదావరి నది నుంచి నిత్యం అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామం మీదగానే ట్రాక్టర్లు అదుపు లేకుండా విపరీత వేగంతో సంచరిస్తుండటం తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు అక్రమ రవాణా కొనసాగిస్తున్నాయని నేడు స్థానికులు చెబుతున్నారు.