ELR: జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, శ్రీ మద్ది ఆంజనేయ మాక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, సామాజికవేత్త, టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ శతజయంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు పురస్కార ఎంపిక కమిటీ నుంచి ఆహ్వానాన్ని అందుకున్నట్టు ఇవాళ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆయనను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు.