BDK: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మేయర్ గణేష్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ 20వ డివిజన్ పరిధిలోని కోమటిపల్లిలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు కొత్తగూడెం మేయర్ గణేష్ హాజరయ్యారు.