KRNL: జిల్లా కలెక్టరేట్లో చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంపై కరపత్రాలను కలెక్టర్ డా. ఏ. సిరి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు లబ్ధిదారులకు ధృవపత్రాలు పంపిణీ చేశారు. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.