ATP: తాడిపత్రిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి రోజు శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి వారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని పుష్పాలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.