MLG: జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్, శ్రీనగర్ సర్పంచ్ మల్లేష్ ఉన్నారు.