SS: ముదిగుబ్బలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల భవనాలను మరమ్మతులు చేయాలని కోరుతూ బుధవారం ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆర్డీటీ సంస్థ ముదిగుబ్బ మండల ఏరియా టీం లీడర్ కృష్ణయ్యకు వినతి పత్రం అందజేశారు. ఆర్డీటీ కార్యాలయంలో ATL కృష్ణయ్యతో మాట్లాడుతూ.. 2007 సంవత్సరంలో TDT సంస్థ నిర్మించిన ఈ పాఠశాల గదులు చాలా వరకు శిధిలావస్థకు చేరాయని తెలిపారు.