పల్నాడు: రెంటచింతల మండలం పాలువాయి గేటు సమీపంలో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న దంపతులు మధ్య జరిగిన వాగ్వాదం ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటంలో మంచికల్లు గ్రామానికి చెందిన నాగలక్ష్మి ట్రాక్టర్ పైనుంచి కిందపడి గాయాల పాలయ్యింది. ఆమెను స్థానికులు వెంటనే నరసరావుపేట హాస్పటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.