ఇచ్ఛాపురంలో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని తహసీల్దార్కు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా బుధవారం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో గ్యాస్ సరఫరా పక్కదారి పడుతుందని శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయని తెలిపారు.