MHBD: డోర్నకల్ మండలం ముల్కలపల్లి విలేజ్లోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం గర్భిణీలకు పౌష్టికహారం పంపిణి కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ డీఎస్ కళావతి- జగదీష్ ముఖ్యఅతిథిగా హాజరై గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. గర్భిణీ స్త్రీలు పోషకాలతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, సరైన జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ సూచించారు.