HNK: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల నిర్వహణలో కొత్త ఒరవడి ప్రారంభమైంది. ఇకపై విద్యార్థుల సమాధాన పత్రాలను ఆన్లైన్లోనే మూల్యాంకనం చేయనున్నారు. ఈ నెలలో జరిగే 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. సుమారు 1.20 లక్షల మంది విద్యార్థుల 8 లక్షల సమాధాన పత్రాలను ఆన్లైన్ ద్వారా కరెక్షన్ చేయనున్నారు.