GDWL: మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో మిషన్ భగీరథ నల్లాలకు ఆన్-ఆఫ్ ట్యాప్లు (వాలు) లేకపోవడంతో తాగునీరు భారీగా వృథా అవుతోంది. ఉదయం, రాత్రి తేడా లేకుండా నీరు నేలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టేందుకు వెంటనే నల్లాలకు ట్యాప్లు అమర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.