SDPT: అకాల వర్షంతో బెజ్జంకి మండలంలోని రైతులు నేలవాలిన వరి, మొక్కజొన్న పంటలు, రాలిపోయిన మామిడికాయలతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు. వెంటనే అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, బాధిత రైతులకు పూర్తి స్థాయి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు పార్టీ అండగా ఉంటుందన్నారు