SRD: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. హనుమాన్ జయంతి వేడుకలు ర్యాలీలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఊరేగింపు ప్రాంతాలు, రద్దీ మార్గాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు.