WNP: అమరచింత మండలంలోని చిన్న కడ్మూర్లో లబ్ధిదారుడు శ్రీను నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి లలిత హాజరై ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులకు ‘సారె’ అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కల నెరవేరుస్తోందని తెలిపారు.
MNCL: మందమర్రిలోని తవక్కల్ హైస్కూల్లో నర్సరీ బాలుడిని పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ చితకబాదారు. అందుగుల పేట గ్రామానికి చెందిన పృద్విక్ తవక్కల్ లో నర్సరీ చదువుతున్నాడు. పృద్విక్ ఒంటిపై ఉన్న దెబ్బలను చూసి విద్యార్థి తల్లిదండ్రులు కరస్పాండెంట్ అజీజ్కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు కరస్పాండెంట్ తెలిపారు.
ASF: జిల్లాలోని జనకాపూర్ బ్రెయిన్ డెడ్ అయిన ఈస్త సృజన(34) అవయవాలను దానం చేసి నలుగురికి జీవితం ప్రసాదించారు బాధిత కుటుంబీకులు. ఇంట్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సృజన ICUలో చికిత్స పొందినా ప్రాణం దక్కలేదు. భర్త అంగీకరించడంతో కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి అవసరంలో ఉన్నవారికి అందించారు. సృజన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
JGL: గొల్లపల్లి మండలంలో తన కుటుంబానికి చెందిన భూమిని ఇతరులకు పట్టా మార్పిడి చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ MRO కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని పేర్కొంది. తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ఆరోపించింది. ప్రజా ప్రభుత్వంలో తనకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు న్యాయం చేయాలన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ యూ మండలం పాములవాడ, నెట్నూర్ గ్రామాలకు చెందిన పలువురు BRS నాయకులు అనారోగ్యానికి గురై ఇటీవలే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA కోవ లక్ష్మి వారి నివాసాలకు వెళ్లి చిత్ర పటాలకు పూలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధించారు. BRS నాయకుల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు.
HNK: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న నిర్వహించనున్న ‘రుద్రమ-1’ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం (నేడు) ఉదయం 11 గంటలకు భద్రకాళి బండ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు అసలైన ప్రయోగం ఉంటుందని, విద్యార్థులు, ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.
MDK: విద్యుత్ షాక్ తగిలి దున్నపోతు మృతి చెందిన ఘటన శంకరంపేట మండలం తిరుమలాపూర్లో గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి బుజమ్మకు చెందిన గేదె పొలంలో మేత మేస్తూ విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్ట్ తీగ తగిలి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సుమారు రూ.40 వేల ఆస్తి నష్టం జరిగిందని బుజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండ క్రాస్ వద్ద గురువారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై ప్రవీణ్ బృందం, విజ్ఞాన భారతి విద్యాలయానికి చెందిన TS 15 UA 44496 స్కూల్ బస్సును ఆపి తనిఖీ చేసింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతున్నట్లు గుర్తించి, అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
WGL: వరంగల్ NITలో జరుగుతున్న ‘స్ప్రింగ్ స్పీ’ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ హీరో అడవి శేషు ఇవాళ నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదాశీర్వచనం అనంతరం అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
NLG: జిల్లా కార్యాలయంలో TSUTF సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు చావా రవి హాజరై మాట్లాడుతూ.. ఐదేళ్లకోసారి అమలు చేయాల్సిన వేతన సవరణను 8 ఏళ్లు అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. గత ప్రభుత్వ 30 నెలలు ఆలస్యం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు.
NZB: అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని బోధన్ ఏసీపీ.శ్రీనివాస్ పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో గురువారం పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ సర్చ్ నిర్వహించారు. ఇండ్లలో సోదాలు నిర్వహించి నిర్వహించి వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఒక ఆటో, 42 ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నారు.
KMR: ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట్ మండలం జలాల్ పూర్ గ్రామంలో బిస సంగయ్య, గడ్డం సంగయ్యకు చెందిన గేదెలు గురువారం తప్పిపోయాయి. ఈ గేదెలు ఎవరికైనా తెలిసినా లేదా పరిసర ప్రాంతాల్లో కనిపించినా, బిస సంగయ్య (9010752397), గడ్డం సంతోష్ (9346851890)కు సమాచారం ఇవ్వాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. తప్పిపోయిన గేదెల విలువ లక్షల్లో ఉంటుందని తెలిపారు.
NZB: టీయు పరిధిలో ఉమ్మడి జిల్లాలో పీజీ మొదటి సెమిస్టర్, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1906 మంది విద్యార్థులకు గాను 1812 మంది హాజరుకాగా 93మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రని ఆయన పేర్కొన్నారు. ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తూ డిబార్ అయ్యారని తెలిపారు.
SRCL: సిరిసిల్ల పొక్సో కోర్టు మైనర్ బాలికపై 2021లో జరిగిన వేధింపుల కేసులో ఇవాళ ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయగా, నేరం రుజువుకావడంతో కోర్టు తీర్పు వెలువరించింది. కేసులో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ అభినందించారు.
మహబూబ్ నగర్: పీయూ ఆడిటోరియం ఫార్మసీ కళాశాలలో IQAC, ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో “గ్రాన్ టూరిస్మో 2.0” ఇన్నోవేషన్ క్యాంపస్ సిరీస్ నిర్వహించారు. వీసీ ప్రొ జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఆవిష్కరణలు సహకారంతోనే సాధ్యమని, విద్యార్థులు కొత్త ఆలోచనలతో స్టార్టప్ల వైపు ముందుకు రావాలని సూచించారు. రిజిస్ట్రర్ ప్రో పి రమేష్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.