ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ యూ మండలం పాములవాడ, నెట్నూర్ గ్రామాలకు చెందిన పలువురు BRS నాయకులు అనారోగ్యానికి గురై ఇటీవలే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA కోవ లక్ష్మి వారి నివాసాలకు వెళ్లి చిత్ర పటాలకు పూలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధించారు. BRS నాయకుల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు.