BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్ తురైరాజా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు అర్చకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. ముత్యాల గర్భాలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ADB: ప్రజలకు ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్ చునార్కర్ సతీష్ అన్నారు. శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలోని రాంనగర్ కాలనిలో ఉన్న నీటి చేతిపంపు చెడిపోయి కొన్ని నెలలుగా అలాగే ఉంది. దీంతో సమస్య ఆయన దృష్టికి రావడంతో చేతిపంపుకు మరమ్మతులు చేసి నీటిని సరఫరా చేశారు. ఈ మేరకు ప్రజలు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
KMM: వెలుగుమట్ల భూదాన్ భూములు నిరుపేదలకే దక్కాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం అత్యంత దుర్మార్గమని చెప్పారు. అర్హులైన పేదలకు న్యాయం చేయాలన్నారు.
MHBD: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పత్ర కీలకమని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. కేసముద్రం రైతు వేదికలో మండల ప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కార్యాలయాల్లో పనులకు నిమిత్తం సతులకు బదులు పతులు వెళ్ళొద్దని, ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో పయనించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
BHPL: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శుక్రవారం భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి అనంతరం ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున ఘనంగా సత్కరించారు.
HYD: సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలోని బౌద్ధ నగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పేదల సంక్షేమం, స్థానికుల మౌలిక సమస్యలపై బస్తీ వాసులను స్వయంగా కలుసుకొని వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డివిజన్లో, బస్తీలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
BDK: రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని సుజాత నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ డిమాండ్ చేశారు. యాసంగి వరి నాట్లు పూర్తి అయి రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను విడుదల చేయడంలో జాప్యం చేయడం తగదని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు అనంతరం రైతుబంధు ఇస్తామని హడావిడిగా ప్రకటించిన ప్రభుత్వం ఎటు పోయిందన్నారు.
HYD: ప్రముఖ చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ (90) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1981లో ఏపీ ప్రభుత్వం ఈయనను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో గౌరవించింది. చిలుకూరు ఆలయంలో హుండీ లేకపోవడం, VIP దర్శనాలు లేకుండా అందరికీ ఒకే క్యూలైన్ వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు.
SRPT: చెన్నకేశవపురం పంచాయతీ ఆదాయ, వ్యయాల వివరాలను బహిర్గతం చేయాలని బీజేపీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. 2024-25 నిధులు, పన్నుల వసూళ్లు, కుక్కల బెడద నివారణ చర్యల వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి ఈ వివరాలు వెల్లడించారు.
MNCL: చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. వారికి మంత్రి వివేక్ వెంకటస్వామి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు పార్టీలో చేరినట్లు తెలిపారు.
MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 276 డివిజన్ ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ రావు సహకారంతో ప్రగతి నగర్ వైకుంఠధామాన్ని పునరుద్ధరణ పనులు చేపట్టారు. పరిరక్షణ కమిటీ సభ్యులు, ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా వైకుంఠధామంలో బోర్ రిఫ్రెషింగ్, కొత్త మోటార్, పూల మొక్కలు పనులు చేపట్టామని తెలిపారు.
JGL: ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండలం లింగాపూర్ సర్పంచ్ వీరేశం పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 3-5 సంవత్సరాలలోపు చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు.
SRCL: మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు, ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ. 8.91 లక్షలతో మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, శుక్రవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
GDWL: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గద్వాల నియోజకవర్గంలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం హైదరాబాదులోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
KNR: రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. యాసంగి ప్రారంభమై రెండు నెలలైన సొమ్ము జమ చేయలేదని విమర్శించారు. ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధులు వేస్తామని ప్రకటించిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్రంలో 67 లక్షలకుపైగా రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.