ASF: దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన అల్లి భాగ్యమ్మకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 75,000 LOC లెటర్ను MLA హరీష్ బాబు శుక్రవారం అందజేశారు. భాగ్యమ్మకి మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నగదు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
NLG: చిట్యాల మండలం ఎలికట్టే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు NMMS ఫలితాలలో ఘనవిజయం సాధించారు. పాఠశాలకు చెందిన పి.హరిణి, ఎస్.కావ్యశ్రీ ఉపకార వేతనాలకు ఎంపికైనట్లు హెచ్ఎం నర్సింహా తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను హెచ్ఎం, ఉపాధ్యాయులు రాంభూపాల్, రవి, పి.వెంకన్న, బి.రామ్మోహన్, డి.వెంకన్న, ఎ.దుర్గయ్య, పి.వెంకన్న అభినందించారు.
SRD: పటాన్ చెరువులో 300 కోట్ల CSR నిధుల ‘సూపర్ స్పెషాలిటీ హాస్పటల్’కు దివంగత డాక్టర్ కిషన్ రావు పేరుపెట్టాలని పారిశ్రామిక ప్రాంత మేధావుల బృందం సభ్యులతో పటాన్చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి పంపించిన లెటర్ తన చేరిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. వెంటనే రాష్ట్ర వైద్య విధాన పరిషత్తుకు పంపిస్తున్నట్ల కలెక్టర్ తెలిపారు. ప్రజల నుండి విజ్ఞాపనలు వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఈ వారం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. గత కొన్ని రోజులుగా పత్తి క్వింటాల్ ధర గరిష్టంగా రూ. 7,550 నుంచి రూ. 7,600 మధ్యనే ఊగిసిలాడింది. శుక్రవారం మార్కెట్కు 28 వాహనాల్లో 226 క్వింటాళ్ల విడి పత్తి రాగా గరిష్టంగా రూ. 7,550 పలికింది.
SRCL: చంద్రశేఖర్ ఆజాద్ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తి అని వేములవాడ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. పోరాట వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95 వర్ధంతి సందర్భంగా వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
RR: మొయినాబాద్లోని అంజనదేవి గార్డెన్లో ఇవాళ మొయినాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లకు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య, HYD మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ అభిరుద్దికి తమ వంతు సహకారం అందచేస్తామని అన్నారు.
PDPL: అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ సందర్శించారు. ఎండ తీవ్రతలో పని చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేతనాల చెల్లింపులు, పనుల నిర్వహణపై ఆరా తీశారు. మహిళా కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు.
NRML: గ్రామ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి తొడసం శంభు అన్నారు. కడెం మండలంలోని పాత రేవాజిపేట గ్రామాన్ని సందర్శించి నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని కమిటీ నాయకులు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాటం చేయడం కోసం సిద్ధం కావాలన్నారు.
MNCL: చెన్నూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్పర్సన్ పెద్దింటి పద్మ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.
KNR: చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు సౌందర్ రాజన్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సౌందరరాజన్ చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పని చేశారు. ఆయన కృషి వల్ల బాలాజీ ఆలయం ప్రజలలో మరింత గౌరవం సంపాదించిందని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతిని, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి నూతన మున్సిపల్ ఛైర్మన్ తంగళ్ల పల్లి శ్రీవాణి రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నూతన కలెక్టర్ను జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
నల్గొండ జిల్లాలోని హాలియా పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA జై వీర్ రెడ్డి, SP శరత్ చంద్ర పవార్ హాజరై ప్రారంభించారు. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేశారు.
ADB: వేసవికాలంలో ఆదిలాబాద్ పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వార్డు నంబర్ 3 జీడీసీ కాలనీలో మంచినీటి బోర్ ఏర్పాటుకు పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాలనీలో ఉన్న నీటి సమస్యను తెలుసుకుని.. కౌన్సిలర్ నిషిద ఆదిత్య ఖండేష్కర్ బోర్ వేయించడం అభినందనీయం అన్నారు.
WGL: వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 3వ డివిజన్లో నీటి ఎద్దడిని నివారించేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్ గుజ్జ వీరరాఘవ రావు శుక్రవారం సొంత నిధులతో కాలనీలో బోరు తవ్వించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించిన వార్డు సభ్యుడికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.