• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు

KNR: ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, కమిటీ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 28న శ్రీ లక్ష్మీనృసింహస్వామి కళ్యాణం, మార్చి 1న బండ్లు తిరుగుట, మార్చి 5న కుంభాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.

February 27, 2026 / 07:06 PM IST

‘కల్వర్టు నిర్మించి సమస్యను పరిష్కరిస్తాం’

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని సరస్వతీ నగర్ ఫేస్-2లో ఛైర్‌పర్సన్ కోనేటి పుష్పలత శుక్రవారం పర్యటించారు. వర్షాకాలంలో వాన నీటితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆమె దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సమస్యను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే కల్వర్టు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 07:05 PM IST

‘కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి’

ADB: మున్సిపల్ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని CPM పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. నూతన మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూషను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. సకాలంలో వేతనాలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరగా ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని నాయకులు పేర్కొన్నారు.

February 27, 2026 / 07:02 PM IST

నర్సింగ్ రావుపల్లిలో ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమం

KMR: నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లిలో శుక్రవారం ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ అంజలీదేవి ఆధ్వర్యంలో గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చెట్లకు నీరు పోశారు. గ్రామాభివృద్ధి, స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.

February 27, 2026 / 07:00 PM IST

షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JN: దూల్మిట్ట, మద్దూరు మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు నేడు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనునిత్యం జనగామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

February 27, 2026 / 06:58 PM IST

కోటగుళ్ళను సందర్శించిన భూపాలపల్లి సీఐ

BHPL: ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన సీఐకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అర్చకులు జూలపల్లి నాగరాజు, తదితరులు ఉన్నారు.

February 27, 2026 / 06:55 PM IST

అన్ని వర్గాల సంక్షేమానికి సమాన ప్రాధాన్యత: MLA

MHBD: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ఎమ్మెల్యే మురళినాయక్ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ ఉప్పరపల్లి రోడ్లో వీర బ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దేవాలయ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

February 27, 2026 / 06:50 PM IST

‘ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం మాఫీ’

MDCL: GHMC పరిధిలో ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ కల్పించే “వన్ టైమ్ సెటిల్‌మెంట్” పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోగేశ్వర్లు సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు ఉన్న బకాయిలను కేవలం 10 శాతం వడ్డీతో ఒకేసారి చెల్లిస్తే రాయితీ వర్తిస్తుందని తెలిపారు. మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు.

February 27, 2026 / 06:46 PM IST

అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష

NZB: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సమయపాలన, నాణ్యతతో పూర్తి చేయాలని వారు సూచించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదల, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతుల పురోగతిపై చర్చించారు.

February 27, 2026 / 06:46 PM IST

​చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన ఎమ్మెల్యే

NLG: హైదరాబాద్‌లోని మెడివిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనంపల్లి సర్పంచ్ రాంసింగ్ నాయక్ కుమార్తె గీతికను దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శించారు. ​ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కంట్లో కత్తెర గుచ్చుకోవడంతో గీతికకు ఆపరేషన్ జరిగింది. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

February 27, 2026 / 06:44 PM IST

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.!

MDK: రేగోడ్(మం) గజవాడలో విద్యుత్ షాక్ తగిలి కుమ్మరి వెంకయ్య(65) మృతి చెందారు. తన ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై కిందపడిపోయారు. ఈ క్రమంలో తల వెనుక భాగానికి తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మేరకు ఎస్సై పోచయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 27, 2026 / 06:44 PM IST

కాటమయ్య కిట్లను పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

JN: జిల్లా కేంద్రంలో శిక్షణ పొందిన కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. కాటమయ్య కిట్లను గౌడ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని, గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

February 27, 2026 / 06:42 PM IST

‘ఉద్యోగ నోటిఫికేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి’

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలో గ్రంథాలయం నుంచి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో మభ్యపెడుతూ, నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేస్తుందని నాయకులు ఇంద్ర నాయక్ మండిపడ్డారు.

February 27, 2026 / 06:40 PM IST

కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన జిన్నారం పాలకవర్గం

SRD: జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్యకి జిన్నారం మున్సిపల్ సమస్యలపై ఛైర్మన్ జనార్ధన్ వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ పరిధిలో తాగునీరు, డ్రైనేజ్, రహదారులు తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాలకవర్గం కలెక్టర్‌ను సన్మానించారు.

February 27, 2026 / 06:38 PM IST

బెజ్జంకిలో ఉచిత పశు వైద్య శిబిరం

SDPT: బెజ్జంకి(మం) రాంసాగర్ గ్రామంలో గోపాలమిత్ర, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ ఇంగాల లక్ష్మి–నాగమల్లేశం శిబిరాన్ని ప్రారంభించారు. మండల పశువైద్యురాలు డాక్టర్ హరిత పాడి పశువులు, దూడలకు నట్టల నివారణ మందులు ఇచ్చి, గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణకు చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరేశం రైతులు పాల్గొన్నారు.

February 27, 2026 / 06:37 PM IST