MBNR: రాజపూర్ మండలంలోని తిరుమలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం ’స్వయం పరిపాలన’ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా బాధ్యతలు చేపట్టి పాఠాలు బోధించి మెప్పించారు. ఎంఈవో సుధాకర్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
SRD: కంగ్టి(మం) సుక్కలతీర్థ్ గ్రామాన్ని AEO సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక శివారులో రైతులు సాగు చేస్తున్న యాసంగి జొన్న పంట క్షేత్రంలో పంటను పరిశీలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం, గాలులకు ఏపుగా పెరిగిన జొన్న పంట కొంత నేలకొరిగింది. అయితే నాలుగైదు మొక్కపైర్లకు ఒకచోట కట్టితే జొన్న పంట కాపాడుకోవచ్చని సూచించారు.
VKB: పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ DMHO రవీందర్ యాదవ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి అక్కడున్న రోగులతో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని? అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మౌలిక సదుపాయాలు అందిస్తున్నారా లేదా? అంటూ కలియతిరిగి పరిశీలించారు.
SRPT: హుజూర్నగర్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం దొడ్డ వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. గత కార్యక్రమాల సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ.. మార్చి 9న కార్మిక, రైతు పార్లమెంట్, మార్చి 10 నుంచి ఏప్రిల్ 13 వరకు దేశవ్యాప్తంగా మహాపంచాయత్లు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
SRPT: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు, కామ్రేడ్ చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మి మృతి అత్యంత బాధాకరమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన ఆమె పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుబటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
SRPT: మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్సై మోహన్ బాబు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమని, ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
WGL: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఎంపీ కడియం కావ్య పరిశీలించారు. ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచే ఈ ఆసుపత్రి ద్వారా వరంగల్తో పాటు పలు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఓపీ, ఐపీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
SRCL: జిల్లాకు చెందిన 12 గ్రామాల ప్రజలు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం పెద్ద లింగాపూర్ సబ్స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామని, తమ దీక్షకు మద్దతుగా రావాలని తీన్మార్ మల్లన్నను కోరారు. 4న దీక్షా శిబిరానికి స్వయంగా హాజరై రైతులకు మద్దతు ఇస్తా అన్నారు.
HYD: చార్మినార్ పరిధిలోని జామ మసీద్ చౌక్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసం అవడంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎంఐఎం నేతలు, స్థానిక ముస్లింలు పాల్గొన్నారు.
NRML: కేజీబీవీలలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భోజన తెలిపారు. బైంసాలో ఏఎన్ఎం ఒక పోస్టు, ఖానాపూర్, దస్తురాబాద్లలో అకౌంటెంట్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రోస్టర్ ప్రాతిపదికన నియామకం జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులు మార్చి 4లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
KMM: బోనకల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న బి. ఉపేందర్ ఉదయం 11గంటలు దాటినా కార్యాలయానికి హాజరు కావడం లేదని శుక్రవారం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా సేవల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ను జిల్లా న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుమన్కు సంబంధించిన న్యాయవాదుల వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సోమవారానికి వాయిదా వేశారు.
MDCL: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో డాట్ల ఫౌండేషన్ కృషి అభినందనీయమని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా తెలిపారు. కౌకూర్ ZPHS పాఠశాలలో డాట్ల ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను శుక్రవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ పూర్ణిమ, ఎంఈవోలు మనోహర్, మురళికృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
PDPL: జిల్లాలో స్త్రీ నిధి బకాయిలను 100% రికవరీ చేయాలని డీఆర్డీవో కాళిందిని స్త్రీ నిధి సిబ్బందిని ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో అధికారులతో స్త్రీ నిధి రుణాలపై సమీక్ష నిర్వహించారు. మార్చి 5 లోపు రుణాల రికవరీ, రుణ ప్రణాళిక 100% పూర్తి చేయాలన్నారు. దీనితో సిబ్బంది వేతనాలు నిలిపివేసి, శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
MNCL: తాండూర్ మండల కేంద్రంలోని ఐబీ బ్రిడ్జి కింద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లెవాడకు చెందిన సెయింట్ థెరీస్సా స్కూల్ బస్సు, బైకును ఢీకొనడంతో మనోహర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు.