KMM: బోనకల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న బి. ఉపేందర్ ఉదయం 11గంటలు దాటినా కార్యాలయానికి హాజరు కావడం లేదని శుక్రవారం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా సేవల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.