NRML: కేజీబీవీలలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భోజన తెలిపారు. బైంసాలో ఏఎన్ఎం ఒక పోస్టు, ఖానాపూర్, దస్తురాబాద్లలో అకౌంటెంట్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రోస్టర్ ప్రాతిపదికన నియామకం జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులు మార్చి 4లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.