SRD: కంగ్టి(మం) సుక్కలతీర్థ్ గ్రామాన్ని AEO సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక శివారులో రైతులు సాగు చేస్తున్న యాసంగి జొన్న పంట క్షేత్రంలో పంటను పరిశీలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం, గాలులకు ఏపుగా పెరిగిన జొన్న పంట కొంత నేలకొరిగింది. అయితే నాలుగైదు మొక్కపైర్లకు ఒకచోట కట్టితే జొన్న పంట కాపాడుకోవచ్చని సూచించారు.