NDL: సంజామల మండలం మంగపల్లెలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 67వ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనట్లు డైరెక్టర్ పి.మౌలాలి రెడ్డి తెలిపారు. పేదల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి నెల ఈ శిబిరాలు నిర్వహిస్తున్ననట్లు పేర్కొన్నారు. వివిధ వ్యాధులకు నిపుణ వైద్యులచే సేవలందించి, సుమారు 1000 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు.