KDP: పోరుమామిళ్లలో డీజల్, పెట్రోల్ కొరత ఉదంటూ సీపీఐ నేతలు ఆదివారం నిరసన చేపట్టారు. ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టి రోడ్డుపై లాగారు. అధికారులు జిల్లాలో ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ పెట్రోల్ బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. యాజమాన్యాలు ఏమైనా అక్రమంగా తరలిస్తున్నారా అని ఆరోపించారు.