SRPT: హుజూర్నగర్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం దొడ్డ వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. గత కార్యక్రమాల సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ.. మార్చి 9న కార్మిక, రైతు పార్లమెంట్, మార్చి 10 నుంచి ఏప్రిల్ 13 వరకు దేశవ్యాప్తంగా మహాపంచాయత్లు నిర్వహించాలని పిలుపునిచ్చారు.