KMR: నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లిలో శుక్రవారం ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ అంజలీదేవి ఆధ్వర్యంలో గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చెట్లకు నీరు పోశారు. గ్రామాభివృద్ధి, స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.