SRCL: వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దమ్మపేట మండలం పూసుకుంట, ఆర్లపెంట గ్రామంలో డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ భవన నిర్మాణం, జడ్పీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుధాపల్లి, పాతలచ్చాపురం గ్రామంలో సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు.
KMR: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 9,572 మంది విద్యార్థులకు గాను 9,258 మంది హాజరయ్యారని, 314 మంది గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
KMR: దోమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మొదటి సంవత్సర ఇంగ్లీష్-I (సెట్–C) పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 140 మంది విద్యార్థులకు 136 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 116 మంది విద్యార్థులకు 115 మంది, వొకేషనల్ విభాగంలో 24 మందికి గానూ 21 మంది పరీక్ష రాశారు. నలుగురు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ఓల్డ్ చెకోపోస్ట్ వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా SP నీతికా పంత్ శుక్రవారం ప్రారంభించారు. SP మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు CC కెమెరాలు మూడవ కన్నులా పనిచేస్తాయని తెలిపారు. ఒక్క CC కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని పేర్కొన్నారు.
SRD: కంగి మండలంలోని ముర్కుంజాల్లో సర్పంచ్ సారంగి అనుష ఆహ్వానం మేరకు, లయన్స్ క్లబ్ ఖేడ్ శాఖ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఓ ఆసుపత్రి బృందం గ్రామస్థులకు పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయి రెడ్డి, సాయ గౌడ్, లాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
KNR: శంకరపట్నం మండలంలోని తాడికల్ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజులుగా శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఎంపీవో ప్రభాకర్ అధ్యక్షతన జరిగుతున్న ఈ కార్యక్రమంలో కొత్తగట్టు, గొల్లపల్లి, లింగాపూర్తో సహా 12 గ్రామాల సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం-2018పై అవగాహన కల్పించారు. నేటితో ఓరియంటేషన్ శిక్షణ ముగియనుంది.
ADB: బోథ్ మండలంలోని కౌట బీ గ్రామంలో గల శ్రీ శబరిమాత ఆశ్రమంలో జరుగుతున్న 14వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో శబరిమాత భక్తులు ఎక్కువగా ఉన్నారని, ప్రజలు ఎల్లప్పుడూ ఇలాగే శాంతి, భక్తి మార్గంలో నడవాలని అన్నారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అన్నదాన సత్రాన్ని శుక్రవారం ఆలయ ఈవో దామోదర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. అన్న ప్రసాదం తయారీ, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. పరిశుభ్రత మరియు నాణ్యత విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్నప్రసాదానికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి తెలిపారు.
KMM: యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ముదిగొండ పోలీస్ సిబ్బంది తెలిపారు. శుక్రవారం మేడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల అనర్ధాలపై విద్యార్థులకు యువత తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సైలు హరిత, అశోక్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.
MDCL: నేరేడ్మెట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న 9 వైన్స్ దుకాణాపై తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు, మల్కాజ్గిరి ఎస్హెచ్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ దుకాణాల వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిలో పేర్కొన్నారు. వినతి ఇచ్చిన వారిలో వీ.ప్రసన్న నాయుడు, కే. గీతామూర్తి, జే.అంజలి దేవిలు ఉన్నారు.
NRML: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా లోకేశ్వరం పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సిర్గా రవీందర్, బాబు సింగ్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. సూపరింటెండెంట్ విఠల్, డీవో నారాయణ పాల్గొన్నారు.
MDK: నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమా సింగ్ను శుక్రవారం జిల్లా ఎస్పీ డీ.వీ. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల్లో పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ యంత్రాంగాలు తదితర అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
MBNR: జర్నలిస్టు నరసింహ కుటుంబానికి అండగా ఉంటామని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నేత సారంగి లక్ష్మీకాంత్ అన్నారు. గత ఆరు నెలల క్రితం అనారోగ్య కారణాలతో జర్నలిస్టు దాసరి నరసింహ మృతిచెందగా, నిన్న ఆయన సతీమణి లలిత కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నేత మృతురాలి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
KMM: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుని వారి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.